మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అందం, అభినయం గురించి వంకలు పెట్టాల్సిన అవసరం లేదు.ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా గుర్తింపు తెచ్చుకునే పాత్రలే చేసింది.
అయితే కంటెంట్ సరిగా లేక సినిమా ఫ్లాప్ కావడంతో ఆమె టాలెంట్ కి తగ్గ గుర్తింపు రాలేదు.సరైన పాత్ర పడితే తనలోని నటిని అద్భుతంగా ఆవిష్కరించడానికి అనుపమ పరమేశ్వరన్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.
వరుస ఫ్లాప్ లతో ఇక ఆమెకి టాలీవుడ్ లో తలుపులు మూతబడిపోయానని అందరూ భావించారు.అయితే అనూహ్యంగా ఇప్పుడు హీరో నిఖిల్ తో వరుసగా 18 పేజెస్, కార్తికేయ సీక్వెల్ లో రొమాన్స్ చేసే అవకాశం సొంతం చేసుకుంది.
ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో కలిసి ఆడిపాడే అవకాశం అనుపమ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.
నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
దీని తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే పీరియాడికల్ థ్రిల్లర్ డ్రామాలో నటించబోతున్నాడు.ఈ సినిమాలో కథ ప్రకారం నానికి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు.
అందులో మూడు పాత్రలు కథలో చాలా కీలకంగా ఉంటాయి.ఈ నేపధ్యంలో ముందుగా ఇందులో ఒక హీరోయిన్ గా సాయి పల్లవిని ఫైనల్ చేశారు.
అయితే ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఇప్పుడు ఆ స్థానంలోకి అనుపమ పరమేశ్వరన్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది.ఆమె కూడా ఇప్పటికే ఒకే చెప్పేసినట్లు వినికిడి.
త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది.
.