‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కేరళకుట్టీ అనుపమ పరమేశ్వరన్ అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపును తెచ్చుకుంది.వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ జనాల గుండెల్లో గుర్తింపు సాధించుకున్న ఈ బ్యూటీ, తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుని సినిమాలు చేస్తూ వచ్చింది.
కేవలం పర్ఫార్మెన్స్కే ప్రాధాన్యత ఇచ్చిన ఈ బ్యూటీ ఎక్కడా కూడా ఎక్స్పోజింగ్ చేయలేదు.
దీంతో క్రమంగా ఆమెకు అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం సినిమాల సంఖ్య తగ్గించింది.
అయితే తాజాగా అనుపమ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఎప్పుడూ అందాలను ఆరబోయని అనుపమ, తాజాగా నడుమందాలు చూపిస్తున్న ఫోటోలో కనిపించింది.
దీంతో ఆమె అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు.ఈ ఫోటోను చూసిన అనుపమ, నెటిజన్లపై మండిపడింది.
నడుమందాలను చూపిస్తున్న ఆ ఫోటో తనది కాదని, తన ఫోటోను మార్ఫింగ్ చేసి ఇలా చూపించారంటూ ఆమె మండిపడింది.ఇలాంటి నీచమైన పనులను మనుష్యులు ఎలా చేస్తారో అంటూ ఆమె తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
నిజం ఏమిటో తెలియకుండా ఇలా తన ఫోటోను షేర్ చేయడం నీచమైన చర్యగా ఆమె వ్యాఖ్యానించింది.