ముద్దుగా పెద్ద కళ్ళతో క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన మలయాళీ సుందరి అనుపమ పరమేశ్వరన్.ఈ భామ ప్రేమమ్ సినిమాతో మలయాళీలో ఎంట్రీ ఇచ్చి తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అఆ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంది.కుర్ర హీరోలందరితో జత కట్టిన ఈ భామకి శతమానం భవతి సినిమా తర్వాత ఆ స్థాయిలో మరో హిట్ పడలేదు.
దీంతో కెరియర్ డీలా పడిపోయింది.ఈమె చివరిగా తెలుగులో రాక్షసుడు అనే సినిమాలో నటించింది.
ఈ సినిమా సక్సెస్ అయిన ఆ క్రెడిట్ అనుపమకి రాలేదు.
ఇదిలా ఉంటే ఇప్పటికే దిల్ రాజు మేనల్లుడుతో రొమాన్స్ చేయడానికి చాల గ్యాప్ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుపమ తాజాగా మరో లేడీ ఒరియాంటెడ్ కథకి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
హనుమాన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట.వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుంది.పీవీపీ బేనర్లో ఈ సినిమా రూపొందనుందట.ఇప్పటి వరకు సోలోగా ఎప్పుడు ఈ అమ్మడు కనిపించలేదు.
కెరియర్ లో మొదటి సారి ఓ లేడీ ఒరియాంటెడ్ కథ అంటే నిజంగా అమ్మడు తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన గొప్ప అవకాశం అని చెప్పాలి.మరి దీనితో అనుపమ తనలోని నటిని పూర్తి స్థాయిలో తెలుగు ప్రేక్షకులకి ఎంత వరకు పరిచయం చేస్తుందో చూడాలి.