బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా అమీర్ ఖాన్ గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ హీరోకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉండగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోగా అమీర్ ఖాన్ కు పేరుంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల ద్వారా ప్రముఖ నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న అనుపమ్ శ్యామ్ కొన్ని రోజుల క్రితం అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందారు.ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఈ నటుడు చనిపోగా అనుపమ్ శ్యామ్ తమ్ముడు అనురాగ్ శ్యామ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన అన్న అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న సమయం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటంతో సహాయం చేయాలని బాలీవుడ్ పెద్దలను కోరానని అనుపమ్ శ్యామ్ అన్నారు.ఎక్కువగా మద్యం తీసుకోవడంతో అనుపమ్ శ్యామ్ ఆరోగ్యం క్షీణించిందని అనురాగ్ శ్యామ్ చెప్పుకొచ్చారు.
ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరడంతో అనుపమ్ కు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురయ్యాయని అమీర్ ఖాన్ వెల్లడించారు.
వెంటిలేటర్ పై ఉన్న సమయంలో అనుపమ్ ఆరోగ్యం బాగానే ఉందని వెంటిలేటర్ తొలగించిన తర్వాత రక్తపోటు తగ్గడంతో పాటు అవయవాలు సరిగ్గా పని చేయకపోవడం వల్ల అనుపమ్ చనిపోయారని అనురాగ్ శ్యామ్ పేర్కొన్నారు.ప్రతాప్ గఢ్ లో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అన్న కొన్ని నెలల క్రితం అమీర్ ఖాన్ ను కలిశారని అమీర్ ఖాన్ కూడా అందుకు అంగీకరించారని అనురాగ్ శ్యామ్ అన్నారు.
అయితే ఆ తర్వాత అమీర్ ఖాన్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని అనురాగ్ శ్యామ్ వెల్లడించారు.టీవీ షోల ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన అనుపమ్ శ్యామ్ అనేక బాలీవుడ్ సినిమాలలో నటించారు.అన్న తను చేస్తున్న ఆవాస్ ప్రతిజ్ఞ2 పూర్తి కానుందనే విషయాన్ని తెలుసుకున్నారని ఆందోళన వల్లే ఆయన చనిపోయి ఉండవచ్చని అనుపమ్ శ్యామ్ చెప్పుకొచ్చారు.