జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అనుదీప్ కేవీ.ఈ యంగ్ టాలెంటెడ్ దర్శకుడు ఈ సినిమా కంటే ముందు పిట్టగోడ అనే సినిమా చేశాడు.
ఈ సినిమా ఓ మోస్తారుగా ఆడిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు.అయితే జాతిరత్నాలు సినిమాని పెద్ద బ్యానర్ లో చేయడం.
దానికితోడు ముగ్గురు టాలెంటెడ్ నటులని సెలక్ట్ చేసుకొని వారితో రెండు గంటల వినోదాన్ని పండించడంతో ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పట్టారు.ఈ జాతిరత్నాలు వేవ్ లో శ్రీకారం లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా కూడా కనుమరుగైపోయింది.
చాలా కాలం తర్వత క్లీన్ కామెడీ ఉన్న సినిమా చూసామని ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ జాతిరత్నాలుకి ప్రశంసలు అందించారు.ఈ క్రెడిట్ అంతా దర్శకుడు అనుదీప్ ఖాతాలోకి వెళ్ళిపోయింది.
దీంతో ఈ టాలెంటెడ్ దర్శకుడుకి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ ల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి.అయితే ఈ కుర్ర దర్శకుడు మాత్రం తన నెక్స్ట్ సినిమాని వైజయంతీ మూవీస్ లోనే చేస్తానని క్లారిటీ ఇచ్చేశాడు.
అది కూడా నవీన్ పోలిశెట్టి హీరోగానే తన నెక్స్ట్ సినిమా ఉంటుందని స్పష్టం చేసేశాడు.జాతిరత్నాలు సినిమా షూటింగ్ టైంలో నవీన్ నటనకి తాను ఫ్యాన్ అయిపోయానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
అలాగే తనకి ఇంత గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన వైజయంతీ బ్యానర్ లోనే తన నెక్స్ట్ కూడా చేస్తానని చెప్పాడు.అయితే ఈ సారి నవీన్ హీరోగా కామెడీ మాత్రమే కాకుండా ఫుల్ లెంత్ లవ్ స్టొరీని చెప్పబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించి స్టొరీ లైన్ సిద్ధంగా ఉందని త్వరలో స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తానని అనుదీప్ చెప్పుకొచ్చాడు.