బాలీవుడ్ లో గత కొంత కాలంలో ఆధిపత్య పోరు నడుస్తుంది.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత రెండు వర్గాలుగా విడిపోయిన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ వివాదం రోజురోజుకి ముడురుతూ తారాస్థాయికి చేరుతుంది.ఎక్కువగా వారసత్వ నటులని వ్యతిరేకించే వర్గం అదే పనిగా విమర్శలు చేస్తున్నారు.
బంధుప్రీతి కారణంగా తాము అవకాశాలు కోల్పోతున్నాం అంటూ తమ ఆవేశాన్ని వెళ్లగక్కుతున్నారు.పనిలో పనిగా దర్శకులని కూడా టార్గెట్ చేస్తున్నారు.
అయితే బాలీవుడ్ లో జరుగుతున్నా ఈ రచ్చ కొంత మంది దర్శకులకి అసహనం కలిగిస్తుంది.వారు బహిరంగంగానే తమ అసంతృప్తి, అసహనం ప్రదర్శిస్తున్నారు.ఇప్పుడు ఈ వరుసలోకి స్టార్ దర్శకుడు అనుభవ్ సిన్హా వచ్చి చేరారు.2001లో కెరీర్ ప్రారంభించిన ఆయన గులాబ్ గ్యాంగ్ కెరియర్ ప్రారంభించిన ఈయన తాజాగా తాప్సీతో తప్పడ్ సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
ఈయన తాజాగా బాలీవుడ్ కి రాజీనామా చేస్తున్నాను అంటూ ఆసక్తికరమైన ట్వీట్ పెట్టారు.ఇప్పటివరకు జరిగిందేదో జరిగింది.ఇకనుంచి ఓ కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నా అని పేర్కొన్నారు.అయితే దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అనుభవ్ హఠాత్తుగా రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏమై ఉంటుంది అనే చర్చ హిందీ పరిశ్రమలో జరుగుతోంది.
అయితే ‘బాలీవుడ్కి రాజీనామా చేస్తున్నాను కానీ సినిమాలు చేస్తాను అని అనుభవ్ సిన్హా పేర్కొనడంపై గత కొంత కాలంగా జరుగుతున్న రచ్చని చూసి అసహనంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే మాట వినిపిస్తుంది.అయితే ఆయన ట్వీట్ పై అనుభవ్ మళ్ళీ క్లారిటీ ఇచ్చారు.
కొన్ని కారణాల వలన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.సమయం వచ్చినప్పుడు అవేంటి అనేది చెబుతా అని ఆయన ట్వీట్ చేశారు.
అయితే హిందీ సినిమాలకి దూరమైనా ఆయన నెక్స్ట్ సౌత్ లో సినిమాలు తీస్తారా లేక నార్త్ లో వేరొక బాషలలో ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి.