నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో టాలీవుడ్లో పరిచయమైన అను ఇమ్మాన్యుయెల్, ఆ సినిమాతో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.ఆ తరువాత ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి.
అయితే వాటిని ఎలా వినియోగించుకోవాలో సరిగా తెలుసుకోలేకపోయిన అను, అతి తక్కువ కాలంలోనే ఐరన్ లెగ్ ముద్రను వేసుకుంది.
అను చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలుస్తుండటంతో, ఆమెను తమ సినిమాలో తీసుకునేందుకు ఎవరు ముందుకు రాలేదు.
దీంతో తమిళంలో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని వెళ్లింది.కానీ అక్కడ కూడా ఆమె ఐరన్ లెగ్ ట్యాగ్ను వేసుకుంది.
దీంతో ఇప్పుడు సినిమా ఆఫర్లు లేక కేవలం సోషల్ మీడియాలో ఫోటోషూట్లు చేస్తూ కాలం గడిపేస్తుంది.అయితే హీరోయిన్గా ఎక్స్పోజింగ్కు ఎక్కవ ప్రాధాన్యత ఇవ్వని అను, ఇప్పుడు ఫోటోషూట్లలో మాత్రం అదిరిపోయే రేంజులో ఎక్స్పోజింగ్ చేస్తోంది.
దీంతోనైనా తనను గుర్తించి ఎవరైనా అవకాశం ఇస్తారని ఆమె భావిస్తోంది.కానీ ఆమెను హీరోయిన్గా తీసుకునేందుకు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో ఆమె కెరీర్ డైలమాలో పడిందని అంటున్నాయి సినీ వర్గాలు.
మరి ఈ బ్యూటీకి ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చే వారు ఎవరైనా ఉన్నారో లేదో చూడాలి.