టాలీవుడ్లో తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించే హీరోయిన్లు చాలా తక్కువ.కానీ వారుఒక్కసారి ప్రేక్షకులను మెప్పించగలిగితే ఆ తరువాత వరుస ఆఫర్లు వచ్చి పడతాయి.
కొందరు ఈ కోవలో స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోతే, మరికొంత మంది తప్పుడు ఎంపికలతో ఫేడవుట్ అయ్యారు.ఈ జాబితాలోకే చేరుతుంది అందాల భామ అను ఇమ్మాన్యుయెల్.
నాని నటించిన మజ్ను సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ ఆ తరువాత పలు సినిమాలు చేసింది.కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు.
ఇక ఇటీవల ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫ్లాపులుగా నిలుస్తుండటంతో ఆమె ఫేడవుట్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.కాగా ఈ హీరోయిన్ నటించిన సినిమాల్లో మెజారిటీ శాతం ఇద్దరు హీరోయిన్లు ఉన్నవే ఉన్నాయి.
ఇదే విషయంపై అను ఇమ్మాన్యుయెల్ తాజాగా ఓ కామెంట్ కూడా చేసింది.
తనకు ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమా అంటే పెద్దగా పట్టింపు ఏమీ లేదని, తనకు అందులో మంచి నటన కనబరిచే పాత్ర దక్కితే చాలని ఆమె అంటోంది.
దీంతో ఆమె సెకండ్ హీరోయిన్గా నటించేందుకు కూడా ఓకే అనే గ్రీన్ సిగ్నల్ను ఇచ్చేసింది.మరి ఇప్పుడైనా ఈమెకు సినిమా అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి.