సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కొంచెం చనువుగా ఉన్నారు అంటే చాలు వారి మధ్య ఏదో నడుస్తోందని వారు ప్రేమలో మునిగితేలుతున్నారని పెళ్లి చేసుకోబోతున్నారు ఇలా అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా టాలీవుడ్ హీరో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసింది.
వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ ఒక వార్త గత కొద్ది రోజులుగా వైరల్ అవుతూనే ఉంది.వారిద్దరు డేటింగ్ లో ఉన్నారు కాబట్టి వారిద్దరు కలిసి నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమాలో కెమిస్ట్రీ ఆ రేంజ్ లో పండింది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ వార్తలు విని కాస్త బాధ కలిగింది అని తెలిపింది అను ఇమ్మానుయేల్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నా గురించి వచ్చే రూమర్స్ ని నేను పెద్దగా పట్టించుకోను.ఈ సినిమా షూటింగ్ మొదలయ్యేవరకు అల్లు శిరీష్ తో నాకు పరిచయం లేదు.
ఈ మధ్య ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి హోటల్ కి వెళ్లినా.వెంటనే రకరకాల పుకార్లు పుట్టించేస్తున్నారు.
అబ్బాయి, అమ్మాయి ఫ్రెండ్స్ లా కూడా బయటికి వెళ్లకూడదా? అంటూ అను ఇమ్మానుయేల్ ఆవేదన వ్యక్తం చేసింది.ఇకపై అయినా తన గురించి ఇటువంటి రూమర్స్ సృష్టించడం ఆపేయాలి అని ఆమె కోరింది.
మరి ఇప్పటికైనా అను ఇమ్మానుయేల్ అల్లు శిరీష్ డేటింగ్ విషయం గురించి వార్తలను సృష్టించడం ఆపేస్తారో లేదో చూడాలి మరి.ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా హీరో కార్తీ సరసన జపాన్ అనే సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.ఈ సినిమా అను ఇమ్మానుయేల్ కి రెండవ తమిళ సినిమా.మొదటి సినిమా పరవాలేదు అనిపించగా మరి రెండవ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ను సాధిస్తుందో చూడాలి మరి.కాగా ప్రస్తుతం అను ఇమ్మానుయేల్ టాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.