ఏదో అనుకుంటే.ఇంకేదో అయినట్లు పబ్లిక్ గా ఆ పని చేస్తూ అడ్డంగా దొరికి పోయింది ఈ చిగాకో బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్.2011లో స్వప్న సంచారీ సినిమా తో మళయాళం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఎంట్రీ తో పాటు అందంగా బోనస్ కావడంతో స్టార్ హీరోల సరసన యాక్ట్ చేసింది.2016లో నానీ హీరోగా మజ్ను సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.తొలి సినిమానే న్యాచురల్ స్టార్ పక్కన యాక్ట్ చేయడం అంటే మాములం విషయం కాదుగా.
నానితో మజ్నులో యాక్ట్ చేసే సమయంలోనే వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి.
అందం, అభినయంతో పాటు ఆవగింజంత అదృష్టం ఉండి ఉంటే బాగుండేదని ఆమె అభిమానులు ఫీలవుతుంటారు.
మజ్నూ తరువాత కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞతావాసి, నాపేరు సూర్య, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలతో టాప్ హీరోలతో యాక్ట్ చేసింది.కానీ అదృష్టం కలిసి రాలేదు.
అయినా సరే తన లక్ ఎలా ఉందో తెలుసుకునేందుకు టాలీవుడ్ సినిమాలపైనే డిపెండ్ అయ్యింది.ప్రస్తుతం అల్లుడు అదుర్స్ తో పాటు మహా సముద్రం సినిమాల్లో యాక్ట్ చేస్తుంది.
అజయ్ భూపతి డైరక్షన్ లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్, సిద్దార్ద్ హీరోలుగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది.
ఓ వైపు సినిమాల్లో యాక్ట్ చేస్తూ అదృష్టం కలిసిరాకపోవడంతో సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అయ్యింది.
న్యూలుక్ లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ చికాగో బ్యూటీ.
, ఐశ్వర్య రాజేష్ తో కలిసి ఓ పార్టీకి అటెండ్ అయ్యింది.ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఐశర్వ రాజేష్ పక్కనే కూర్చొని ఉండగా.అను డ్రింక్ చేస్తున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.
ఆ ఫోటోలపై ఈ చికాగో బ్యూటీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.