భారత దేశం రక్షణ రంగం రోజులు గడిచే కొద్ది మరింత బలంగా మారుతుంది.తాజాగా శత్రు దేశాల రాడార్లను క్షణాల్లో మట్టి కరిపించే క్షిపణిని విజయవంతం గా పరీక్షలు జరిపింది.
ఈ మిస్సైల్ ను సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు.ఇది శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను క్షణాల్లో దెబ్బ కొట్టగలదు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మిస్సైల్ శబ్ద వేగం కన్నా రెట్టింపు వేగంతో ముందుకు దూసుకుపోతుంది.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అధికారి ఒకరు చెప్పిన వివరాల ప్రకారం, వ్యూహాత్మక యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం ని డీఆర్డీవో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పరీక్షించగా , అందులో ఆ మిస్సైల్ విజయం సాధించింది.ఒడిశాలోని బాలాసోర్ నుంచి దీనిని ప్రయోగించారు.
భారత వాయు సేన సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించగలిగే ఈ మిసైల్ శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బ తీస్తుంది.
ఈ రుద్రం మిసైల్ తో శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థను దెబ్బతీయగలిగే కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం వాయు సేనకు వచ్చింది.
భారత వాయు సేన నిరాటంకంగా, సమర్థవంతంగా తన కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలవుతుంది.యుద్ధ విమానం ప్రయాణించే ఎత్తునుబట్టి ఈ మిసైల్ పరిథి ఆధారపడి ఉంటుంది.కనిష్టంగా 500 మీటర్ల ఎత్తు నుంచి, గరిష్ఠంగా 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి దీనిని ప్రయోగించవచ్చు.250 కిలోమీటర్ల పరిథిలో రేడియేషన్ ను వెలువరించే లక్ష్యాన్ని ఛేదించవచ్చు.ఫైనల్ గా ఈ రుద్రం భారత దేశపు మొదటి యాంటీ రేడియేషన్ మిసైల్ కావడం విశేషం.