మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి సెట్స్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిందనే వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.అగ్ని ప్రమాదంలో రెండు కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటూ చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
తాజాగా ఈ విషయమై యాంటీ మెగా ఫ్యాన్స్ కొందరు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు.అసలు అగ్ని ప్రమాదం చిత్ర యూనిట్ సభ్యులు జరిగేలా చేశారంటూ వారు అంటున్నారు.
సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది.ఈ సమయంలో అగ్ని ప్రమాదం పేరుతో ఇన్సూరెన్స్ రాబట్టాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అగ్నిప్రమాదం సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పాటు, షూటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత అగ్ని ప్రమాదం జరగడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సెట్కు పూర్తి ఇన్సూరెన్స్ చేయింరట.ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇలా చేసి ఉంటారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఆ వార్తలపై, ఆ కామెంట్స్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.150 కోట్ల బడ్జెట్ తీస్తున్న వారు ఇలా చిల్లరగా ప్రవర్తించరు అని, అలాంటి బుద్దులు మీహీరోలకు ఉన్నాయేమో ఒకసారి ఆలోచించండి.గతంలో మీరు అభిమానిస్తున్న హీరోలు అలా చేయడం వల్ల ఇప్పుడు ఇలా మీరు అంటూ ఉండవచ్చు అంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.అన్ని వర్గాల వారిని ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.
ఇలాంటి సమయంలో ఇలా చిల్లర పుకార్లు రావడంతో చిత్ర యూనిట్ సభ్యులు కాస్త అసహనంతో ఉన్నారు.