అసలు వైట్ హౌస్ లో ఏమి జరిగింది.ఒక్క సారిగా అంత మందికి అమాంతం కరోనా సోకడానికి గల కారణాలు ఏమిటి.
దేశాధ్యక్షుడు ఆయన సతీమణి, ఇంకా ముఖ్య అధికారులకు సైతం కరోనా సోకడానికి ఎలాంటి పరిణామాలు జరిగి ఉండచ్చు అనే సందేహం ప్రతీ ఒక్కరిలో కలుగుతోంది.ఒకరి తరువాత ఒకరికి ఒక రోజు అటు ఇటూ లో కరోనా సోకడం అమెరికా వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.
దాంతో ఈ విషయాలకు సమాధానంగా అమెరికా అంటువ్యాధులు కరోనా నియంత్రణ టీం సభ్యుడు డాక్టర్ ఆంటోని పౌసీ సంచనల విషయాలు వెల్లడించారు.
సెప్టెంబర్ 26 న ట్రంప్ వైట్ హౌస్ లో ఓ భారీ కార్యక్రమం నిర్వహించారు.
ఆ కార్యక్రమంలో అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బారెట్ ను ప్రకటించిన విషయం విధితమే.ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయమే పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడానికి కారణం అయ్యిందని పౌసీ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఒక్కరంటే ఒక్కరు కూడా మాస్క్ లు దరించలేదని ఇంతటి నిర్లక్ష్యమే దాదాపు 30 మందికి కరోనా సోకడానికి కారణమయ్యిందని అన్నారు.
ట్రంప్ ప్రత్యేక కార్యదర్శి హాప్ హిక్స్ ముందుగా కరోనా బారిన పడగా తరువాత ట్రంప్ ఆయన సతీమణికి కరోనా పాజిటివ్ నమోదు అయ్యిందని, ఆ తరువాత వైట్ హౌస్ అధికార ప్రతినిధి కెలీ మెక్నీ , సలహాదారులు మిల్లర్, నికోలస్ లతో పాటు దాదాపు 12 మంది సన్నిహిత ఉన్నత అధికారులకి కరోనా సోకింది.ఇదిలాఉంటే సోమవారం నుంచీ తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సిద్దంగా ఉన్నానని ట్విట్టర్ ద్వారా ట్రంప్ ప్రకటించారు.యధావిధిగా ప్రచారాలు, డిబేట్ కార్యక్రమాలకు హాజరవుతానని వెల్లడించారు.