ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా హాట్ టాపిక్ గా కొనసాగుతున్న అంశం రేవంత్ రెడ్డి పాదయాత్ర.జరిగిన అన్ని ఎన్నికల్లో సత్తా చాటక చతికిల పడ్డ విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు బీజేపీ రోజురోజుకు బలపడుతుండటం, కాంగ్రెస్ కార్యకర్తలు నైరాశ్యంలో మునిగి ఉన్న సందర్భంలో ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు, పార్టీని చైతన్యం చేయాలనే ఉద్దేశ్యంతో పాదయాత్రను చేపడుతున్నారు.అదే విధంగా పాదయాత్రలు చేపట్టిన వారు గొప్ప నాయకులుగా ఎదిగిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఒకప్పుడు ఉదాహరణకు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరిగి అధికారంలోకి తీసుక రావడానికి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఎంచుకున్న వ్యూహం పాదయాత్ర.ఇక ఆ పాదయాత్ర అనంతరం రాజశేఖర్ రెడ్డి గొప్ప నాయకుడిగా ఎదగడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు.
అచ్చం ఇలాగే వై.ఎస్ ఉన్నప్పటి పరిస్థితులు ప్రస్తుతం ఉండడంతో రేవంత్ రెడ్డి ఈ పాదయాత్ర వ్యూహాన్ని అమలుపరచాడనేది రాజకీయ వర్గాల టాక్.ఇప్పటికే రోజు ప్రజలతో పాదయాత్రలో ప్రజల కష్టాలను పంచుకుంటూ ముందుకెళ్తున్నాడు.ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నా పూర్తి స్థాయిలో సహకరించడం లేదనేది వాస్తవం.