సెల్ఫీ కి మరో యువతి బలి

సెల్ఫీ పిచ్చి మరో యువతి బలైపోయింది.ఏపీ లోని కృష్ణా జిల్లా కు చెందిన ఒక వైద్యురాలు సెల్ఫీ తీసుకోబోతూ ప్రమాదవశాత్తు కెరటాలకు కొట్టుకొని పోయింది.

 Another Women Die For Selfie-TeluguStop.com

ఈ ఘటన గోవా లో మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకీ వెళితే….కృష్ణా జిల్లా జగ్గయ్య పేటకు చెందిన ఊటుకూరు రమ్యకృష్ణ వృత్తి రీత్యా ఒక వైద్యురాలు.2008 వరకు జగ్గయ్య పేట హెల్త్ సెంటర్ లో డాక్టర్ గా పనిచేసిన రమ్య అనంతరం గోవా లో ప్రభుత్వ అనుబంధ వైద్య సంస్థలో ఉద్యోగంలో చేరింది.అయితే మంగళవారం సాయంత్రం గోవా బీచ్ కి వెళ్లిన రమ్య నీళ్ల లోకి దిగి సెల్ఫీ తీసుకోవాలని చూసింది.

అయితే ఉన్నట్టుండి అటుగా వచ్చిన సముద్ర కెరటాలు ఒక్కసారిగా రమ్య ను లోపలికి లాకెళ్ళడం తో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.

దీనితో రమ్య ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.సెల్ఫీ ల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు అనర్ధాలు చోటుచేసుకుంటున్నప్పటికీ ఈ తరం యువతీ యువకులలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.

సెల్ఫీ కోసం నీళ్ల ల్లో కొంచం లోపలి వెళ్లడం తో రమ్య ఈ ప్రమాదానికి గురైనట్లు అధికారులు భావిస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న గోవా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube