వీర్వోల మధ్య గొడవ ! చెవినే కొరికేసాడు బాబోయ్

ఇద్దరు అధికార్ల మధ్య ఏర్పడిన చిన్న వివాదం మరింత ముదిరి ఒకరి చెవిని మరొకరు కొరికేసిన సంఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది.అది కూడా వారు పనిచేసే ఎమ్మార్వో కార్యాలయంలోనే జరగడం సంచలనం రేపుతోంది.

 Another Vro Money Dispute In Kurnool-TeluguStop.com

పూర్త వివరాలు పరిశీలిస్తే సుంకేశుల వీఆర్వో వేణుగోపాల్ రెడ్డి, జోహరాపురం వీఆర్వో కృష్ణదేవరాయ పరస్పరం దాడులు చేసుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు.ఈ క్రమంలో వేణుగోపాల్‌రెడ్డి చెవిని కృష్ణదేవరాయ కొరికేశాడు.

దీనిపై రెవెన్యు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సుంకేశుల వీఆర్వో వేణుగోపాల్ రెడ్డి కంప్యూటర్ ఆపరేటర్‌గా కూడా విధులు నిర్వహిస్తున్నాడు.అయితే, ఓ రైతు భూమికి సంబంధించిన వివరాలు అప్‌డేట్ చేయాలని కృష్ణదేవరాయ కోరాడు.

అయితే, చాలా రోజుల నుంచి వివరాలు అప్‌డేట్ చేయకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నాడు.ఈ విషయంలో ఎమ్మార్వో ఎదుటే వీఆర్వోలు ఇద్దరూ గొడవపడ్డారు.

అయితే, తాను ఎప్పుడో వివరాలు అప్‌డేట్ చేశానని వేణుగోపాల్ రెడ్డి చెప్పాడు.ఇద్దరూ అప్పటికప్పుడు సిస్టమ్‌లో చెక్ చేయగా, అందులో రైతు పేరు తప్పు ఉంది.

దీంతో కావాలనే అలా చేశాడని కృష్ణదేవరాయ అనుమానం వ్యక్తం చేశాడు.అయితే, ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినకుండా కలబడి కొట్టుకున్నారు.

ఆవేశంలో వేణుగోపాల్ రెడ్డి చెవిని కృష్ణదేవరాయ కొరికివేశాడు.అయితే వీరిద్దరి మధ్య డబ్బు తగాదాలే అసలు కారణం అని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube