ఏపీలో లోన్ యాప్ వేధింపులు తాళలేక మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడగా.
తాజాగా మరో వ్యక్తి బలవన్మరణం చెందాడు.తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పు చెల్లించిన తర్వాత కూడా లోన్ యాప్ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడటంతో.తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్ రావు బలవన్ మరణం చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మృతుడు విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు.