మా ఎన్నికల్లో మరో ట్విస్ట్.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ఎన్నికల ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.ప్రతిసారి ఇద్దరు మాత్రమే పోటీ పడే మా ఎన్నికల్లో ఈసారి ఐదుగురు అభ్యర్థులు (ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, CVL నరసింహ రావు ) పోటీ పడుతుండడంతో ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.‘మా’ ఎన్నికల కార్యవర్గం పదవీకాలం పూర్తయింది కనుక వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 15 మంది సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడైన ‘ రెబల్ స్టార్’ కృష్ణంరాజుకు లేఖ రాశారు.2019లో ఎన్నికైన 15 మంది సభ్యులు తమ పదవీ కాలం పూర్తయిందని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
గతములో రాసిన లేఖకు ఇప్పటివరకు జవాబు లేకపోవడంతో మరోసారి లేఖ రాశామని ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తెలిపారు.మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గురువారం సమావేశమై ఎన్నికల నిర్వహణకు చర్చించనున్నారు సెప్టెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ప్రస్తుతం మా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ తో పాటు CVL నరసింహ రావు కూడా ఉన్నారు అయితే వీరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మద్య పధానంగా పోటీ ఉండే అవకాశాలున్నాయి.
ఏకగ్రీవం పై కూడా చర్చ జరుగుతుంది రేపు జరగబోయే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.