తెలుగు సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు పెద్ద నిర్మాతలు ఇన్ని రోజులు వెనుకాడారు.ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తే వచ్చే నష్టం ఏంటీ అనేది కొందరు ఆలోచిస్తున్నారు.
మొదటగా దిల్ రాజు ఈ ఆలోచన చేశాడు.నష్టం భారీగా ఉండటం కంటే ఓటీటీలో నష్టంను పూడ్చుకోవడం లేదా లాభాలు దక్కించుకోవడంకు ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలని దిల్ రాజు భావించాడు.
అందుకు యూనిట్ సభ్యులను కూడా ఒప్పించాడు.దాంతో మరికొన్ని రోజుల్లో ‘వి’ సినిమా విడుదల కాబోతుంది.
వి సినిమా విడుదల అయిన రెండు మూడు వారాల్లో మరో రెండు మూడు సినిమాలు కూడా వస్తాయనే ప్రచారం జరుగుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ నటించిన రెడ్ సినిమా విడుదల విషయంలో చర్చలు జరుగుతున్నాయి.
వి సినిమా ఓటీటీ ఫలితాన్ని మరియు రెవిన్యూను బట్టి చూసి రెడ్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట.ఈ విషయంలో రామ్ అండ్ యూనిట్ సభ్యులు చర్చలు కూడా జరిపారు.
ఓటీటీ రిలీజ్ కు వెళ్లాల్సిన సమయం వచ్చింది అంటూ తెలుగు సినిమాల మేకర్స్ నిర్ణయించుకుంటున్నారు.
రెడ్ చిత్రంతో పాటు ఉప్పెన మరియు సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేస్తారనే టాక్ ఉంది.సెప్టెంబర్ నుండి థియేటర్లు ప్రారంభం అవుతాయని అంతా ఎదురు చూశారు.కాని అన్ లాక్ లో భాగంగా మళ్లీ థియేటర్ల ఓపెన్ కు అనుమతులు ఇవ్వలేదు.
దాంతో ఓటీటీ విడుదలకు వెళ్లే విషయమై మరింత సీరియస్గా ఈ సినిమాల వాళ్లు ఆలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఒకటి రెండు వారాల్లో ఈ మూడు సినిమాల ఓటీటీ విడుదల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.