తెలుగు ఇండస్ట్రీ లో ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎస్పీ బాలు పాటలు అంటే మనలో చాలామంది ఇష్టపడేవారు ఉన్నారు.
ఆ పాటలను నిత్యం వింటూ ఎంజాయ్ చేసే వారు ఎందరో.భౌతికంగా భూమి మీద బాలుగారు లేకపోయినా కానీ.
ఆయన సంగీతం మాత్రం అందరి నోట వినిపిస్తుంది.ఇప్పటికీ బాలు మరణించి 4 నెలలు గడిచినా కూడా బాలు పాట కోసం ఎందరో అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు.
తాజాగా బాలు పాడిన పాట ఒకటి విడుదల అయ్యింది.ఆయన బతికి ఉన్నప్పుడు రికార్డ్ చేసిన పాటకు సంబంధించిన వీడియో సాంగ్ ప్రస్తుతం విడుదల చేశారు ఆ సినిమా దర్శక నిర్మాతలు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.74 సంవత్సరాల వయసులో కూడా బలు పడిన ప్రేమ పాటను ప్రేక్షకులను బాగా అలపించిన తీరుకు ముగ్దుల్లు అవుతున్నారు.
బాలు లాంటి గాత్రం మరొకరికి రాదు.సాధ్యంకాదు.అంటూ బాలు అభిమానులు కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.ఇక బాల సుబ్రహ్మణ్యం తెలుగు, తమిళ్ ఇతర భాషలలో కూడా ఎన్నో వేల పాటలను పాడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఆయన చివరి సారిగా పాడిన పాటలలో ఒకటైన సాంగ్ ప్రస్తుతం విడుదల చేశారు.ఈ పాట దేవదాస్ పార్వతి సినిమాలో లాక్ డౌన్ మొదల అవ్వకముందు బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు.
అప్పట్లోనే రికార్డు సృష్టించిన ఈ పాట ప్రస్తుతం లిరికల్ వీడియోను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.ఈ పాటలో బాలు వాయిస్ విని బాలు అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు.
బాలు చివరిసారిగా పాడిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.