టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు విజయ్.
ఈయన హీరోగా సక్సెస్ అయిన తర్వాత విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.మొదటి సినిమాతోనే ఛాలెంజింగ్ కథతో ప్రేక్షకుల ముందు వచ్చాడు ఆనంద్ దేవరకొండ.
దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
ఈ సినిమా తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా కూడా చేసాడు.
తను చేసే సినిమాలు ఒక డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి.విభిన్న కథలతో ప్రేక్షకులకు గుర్తుండి పోయే రోల్స్ చేస్తున్నాడు ఆనంద్.
ఇప్పుడు తన మూడవ సినిమా ‘పుష్పక విమానం’ తో మన ముందుకు రాబోతున్నాడు.దామోదర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది.ఈ సినిమాను విజయ దేవరకొండ సమర్పణలో కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో గీత్ సైని, శాన్వి మేఘన హీరోయిన్లుగా నటిస్తున్నారు.అంతేకాదు ఈ సినిమాలు సునీల్, నరేష్ కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
ఇప్పటికే ”సిలకా ఎగిరిపోయావా” అంటూ సాగే పాటను విజయ్ దేవరకొండ రిలీజ్ చేసాడు.అయితే తాజాగా ఈ సినిమా నుండి మరొక పాటను విడుదల చేయబోతున్నారు.ఈ పాటను అక్కినేని సమంత చేతుల మీదగా విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది చిత్ర యూనిట్.
కళ్యాణం అంటూ సాగే ఈ పాటను సమంత జూన్ 18 న ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారని చిత్ర యూనిట్ తెలిపారు.
కళ్యాణం పాట హీరో హీరోయిన్ల మధ్య వచ్చే వివాహ సమయంలో రాబోతుందని తెలుస్తుంది.మరి చూడాలి ఈ పాట ఏ మేరకు ఆకట్టుకుంటుందో.