దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతూ ఉండటంతో దేశవ్యాప్తంగా ప్రజల నుండి అనేక విమర్శలు కేంద్రంపై వస్తున్నాయి.ముఖ్యంగా మధ్యతరగతి అదేవిధంగా పేద ప్రజలు బతికే పరిస్థితుల్లో దేశంలో లేవని చాలా మంది రాజకీయ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు.
ఇలాంటి తరుణంలో మరోవైపు వంటగ్యాస్ సిలిండర్ ధర విషయంలో 25 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు ప్రకటించడం జరిగింది.
దీంతో ఒకే నెలలో మూడు సార్లు వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి నట్లయింది.
తాజాగా పెంచిన ధర తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది.ఫిబ్రవరి 4వ తారీఖున ₹25 పెంచగా ఆ తర్వాత 15వ తారీఖున 50 రూపాయలు పెంచారు.
అయితే తాజాగా 25 రూపాయలు పెంచటంతో నెలలో మొత్తంగా గ్యాస్ సిలిండర్ ధర వంద రూపాయలు పెరిగినట్లు అయింది.దీంతో సామాన్య ప్రజలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ పై మండిపడుతున్నారు.
ఇలా అయితే బతికే పరిస్థితి దేశంలో ఉండదని లబోదిబోమంటున్నారు
.