జగన్ సర్కారుకు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది.రాష్ట్రంలోని మైనింగ్ భూములను ఇతర అవసరాలకు కేటాయించవద్దని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం పలుచోట్ల మైనింగ్ భూములను కేటాయించారని దాఖలైన పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారించింది.ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్ భూములను కేటాయించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీనిపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మైనింగ్ భూములపై కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.