ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీలో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి.ఒకరిద్దరు మినహాయిస్తే అందరూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పొసక్కడం లేదు.
తాజాగా ఇటివల గుంటూరు జిల్లాలోని ఓ తహసీల్దార్ విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య మాటల యుద్ధం సాగుతుంది.ఇప్పటికే వారి ఇద్దరు మధ్య సంవత్సరం కాలంగా ఆధిపత్య పోరు ఉండగా, ఇప్పుడు తహసీల్దార్ పోస్టింగ్ విషయంలో తారస్థాయికి చేరింది.
సదరు ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఏ మండలంలో తహసీల్దార్ ఉండొద్దని, ఆయనన ప్రభుత్వానికి లేఖలు రాశారు.పట్టుబట్టి మరి ఆ తహసీల్దార్ను బదిలీ చేసే ప్రయతం చేశారు.
ఆయన పడిన శ్రమకు ఫలితంగా ఇటివల ఆ తహసీల్దార్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి.ఆ తహసీల్దార్ బదిలీ కాకుండా ఆ ఎంపీ తీవ్ర ప్రయత్నాలు చేశారు.
దీంతో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వార్ రసవత్తరంగా మారింది.ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడక ముందకు గుంటూరు జిల్లాలలోని ఆ మండలంలో భూముల ధరలు బాగా ఉన్నాయి.ఎకరం భూమికి సుమారు రూ.2 కోట్లు పలుకేంది.అయితే సీఎం జగన్ రాజధానిని మరో చోటుకు తరలించడంతో ఆ మండలంలో భూముల రెట్లు ఒక్కసారిగా పడిపోయ్యాయి.ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మళ్లీ ఆ భూముల రెట్లకు రెక్కలొస్తాయి అధికార పార్టీలు నేతులు గంపడు ఆశతో ఉన్నారు.
అయితే ఆ తహసీల్దార్ సదరు ఎమ్మెల్యే చెప్పిన మాటను ఖాతరు చేయడం లేదు.దీంతో ఎమ్మెల్యే పట్టుబట్టి మరి తహసీల్దార్ ను బదిలీ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు.దీంతో కలెక్టర్ వివేక్ యాదవ్ ఆ తహసీల్దార్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.ఎంపీ ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తేవడంతో కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ అమలుకు నోచుకోవడం లేదు.
తన నియోజకవర్గ పరిధిలో ఆ ఎంపీకి సంబంధం లేదని కావాలనే ఆయన ఇలా చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.