సాయి కుమార్ తనయుడిగా వెండి తెరకు పరిచయమయ్యి మంచి నటనతో పాటు, డాన్సులతో కూడా ప్రేక్షకులను అక్కట్టుకున్నాడు ఆది.కానీ ఈ మధ్య సరైన వరస ప్లాపులతో కొద్దిగా వెనుక పడ్డాడు.
కొద్దిగా గ్యాప్ తీసుకుని మళ్ళీ శశి అనే సినిమాతో రాబోతున్నాడు.ఈ సినిమా రేపు అనగా మార్చి 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
శశి సినిమాను శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్స్ గా సురభి, రాశి సింగ్ నటిస్తున్నారు.ఈ సినిమాను శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి.వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన “ఒకే ఒక లోకం నువ్వే” సాంగ్ భారీ హిట్ అయ్యింది.
ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆది పలు మీడియా చానళ్లకు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు.ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి చెప్పారు.
ఈ సినిమా టైటిల్ ను హీరోయిన్ రోల్ ఆధారంగా పెట్టామని తెలిపారు.అంతేకాదు ఈ పేరు పెట్టడానికి ఇంకో కరం కూడా ఉందట.
శశి పేరుకు ఈ సినిమాలో ఇంకో ఇంట్రెస్టింగ్ కోణం కూడా లింక్ అయ్యి ఉంటుందని అదేంటో తెలియాలంటే ఈ సినిమా ను చూడాల్సిందే అని ఆది చెబుతున్నాడు.మరి ఆ ఇంట్రెస్టింగ్ కోణం ఏమిటో తెలుసు కోవాలంటే మీరు ఖచ్చితంగా రేపు రిలీజ్ అయ్యే సినిమాను థియేటర్స్ లో చూడాల్సిందే.
ఆది ఈ సినిమా తో మరొక సారి తన అదృష్టాన్ని పరీక్షించు కోబోతున్నాడు.మరి చూడాలి ఈ సినిమా ఆది కెరీర్ కు ఎంత వరకు ఉపయోగపడుతుందో.