నటుడు సోనుసూద్ లాక్ డౌన్ సమయములో వలస కార్మికుల కోసం తీసుకున్న చర్యలు చేసిన సహాయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే.సొంత ఖర్చులతో వలస కార్మికులకు ప్రత్యేకమైన బస్సులు అదేవిధంగా రైళ్లు స్పెషల్ ఫ్లైట్లు ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు చేర్చటం జరిగింది.
ప్రభుత్వాలు కూడా ముందుకు రాని కీలక సమయంలో దేశంలో చాలా మంది హీరోలు ఉన్నాగాని సోనుసూద్ కీలక టైంలో వలస కార్మికులను ఆదుకోవటం ఆ తర్వాత సహాయ కార్యక్రమాలు చేస్తూ అనేక మంది పేదవారిని అనేక రీతులుగా ఉపయోగపడుతూ ఉండటం ఆయనకు మంచి పేరు తీసుకోవటం జరిగింది.చదువుకోవాలని ఆశ పడుతున్న పేద వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్పులు అందించటం మాత్రమే కాక ఉపాధి కలిగే రీతిలో అనేక సహాయాలు చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా మరోసారి దేశాన్ని ఆశ్చర్యపరిచే రీతిలో స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలో ఎనిమిది మంది నిరుద్యోగులకు తన సొంత ఖర్చుతో ఈ-రిక్షాలు అందించారు.ఈ ఈ కార్యక్రమంలో సోను సూద్ సోదరి మాళవిక సచార్, బావ గౌతమ్ సచార్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు విషయాలు తెలియజేవారు.ఇదే రీతిలో దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు 150 ఈ-రిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నట్లు, ఈ విధంగా అయినా కొంత మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు.
అంతమాత్రమే కాకుండా తన కుటుంబం చిన్ననాటి నుండి ఇతరులకు సేవ చేసే గుణాన్ని అలవర్చుకోవాలని పెద్దలు చెప్పినట్లు ఈ విధంగా అవసరమైన ప్రతి ఒక్కరు సహాయం చేస్తూ తన బాధ్యత నిర్వహిస్తున్నట్లు సోను సూద్ చెప్పుకొచ్చారు.
.