రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది.ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉంటే.
రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఇది.ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం మేర పూర్తి అయ్యింది.
ప్రస్తుతం రామ్ చరణ్, ఆలియా భట్ మీద కొన్ని సీన్స్ తో పాటు, ఒక రొమాంటిక్ సాంగ్ కూడా చిత్రికరిస్తున్నారు.ఈ సాంగ్ కోసం ఒక భారీ సెట్ కూడా వేశారు.
డీవీవీ దానయ్య ఈ సినిమాను 350 కోట్ల తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ను రాజమౌళి శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.
అక్టోబర్ 13 న ఈ సినిమా విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తున్నారు.
రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటు చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నాడు.
ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపు 40 నిముషాలు ఉంటుందని తెలుస్తుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్ అవ్వనున్నాయట.తండ్రి, కొడుకు ఒకే స్క్రీన్ లో కనిపించబోతున్నారని తెలిసి మెగా ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు.
అయితే రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత శంకర్ తీస్తున్న భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.అయితే ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ గురించి రోజుకో పేరు వినిపిస్తుంది.ఆ మధ్య ఈ సినిమాలో కొరియన్ భామను తీసుకుంటున్నారని గాసిప్ వచ్చింది.అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికతో పాటు కియారా అద్వానీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.మొత్తానికి రోజుకో గాసిప్ తో సినిమాకు మంచి ప్లస్ అవుతుంది.