హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మెట్రో సర్వీసులు ప్రారంభం కావడంతో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ పేరు అన్ని విధాల మారుమ్రోగుతోంది.ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ హైదరాబాదీల కోసం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయడానికి రెడీ అయింది.
మేటర్ లోకి వెళ్తే నిజాం కాలం లో హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులో ఉండేవనే టాక్ ఉండేది.కానీ కాలక్రమేణా అవి కనుమరుగవడం అందరికీ తెలిసిందే.
తరుణంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు పునరుద్ధరించడానికి టిఎస్ఆర్టిసి రంగం సిద్ధం చేస్తోంది.పర్యాటక రంగ తరహాలో హైదరాబాద్ నగరంలో ప్రముఖ కట్టడాలను వీక్షించే తరహాలో ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్టీసీ రెడీ అవుతుంది.
ఈ నేపథ్యంలో ముందుగా 50 లోపు బస్సులను అన్ని ప్రధాన రోడ్లతో తిప్పడం కోసం అధికారులు ఇప్పటికే ఓ రూట్ మ్యాప్ తో పాటు నివేదిక కూడా రెడీ చేసినట్లు సమాచారం.ఇదిలా ఉంటే నగరంలో ఎక్కువగా రద్దీ ఉండే కోఠి-పటాన్చెరువు, మెహిదీపట్నం-సికింద్రాబాద్ రూట్లలో ఈ బస్సులను నడిపించే అవకాశాలపై అధికారులు కొద్దిగా ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ విషయాన్ని తాజాగా గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
.