ఏపీలో వైకాపా ప్రభుత్వం వచ్చి అయిదు నెలలు అయ్యిందో లేదో అప్పుడే వేల కొద్ది ఉద్యోగాలను వేసిన విషయం తెల్సిందే.వలంటీర్లు మరియు సచ్చివాలయ ఉద్యోగులను పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్న ఏపీ ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఇప్పటి వరకు అదుగో ఇదుగో అంటూ వస్తున్న భర్తీకాని వలంటీర్ల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.అతి త్వరలోనే ఈ విషయమై ఒక అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా వైకాపా పార్టీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
రాష్ట్రంలో మొత్తం 70888 వలంటీర్ల ఉద్యోగాలు ఉన్నాయి.అప్పుడు ఉద్యోగాలను నియమించిన సమయంలో కొన్ని ఉద్యోగాలు అలాగే మిగిలి పోయాయి.కొందరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మళ్లీ ఆ జాబ్ను వదిలేశారు.అలా ప్రస్తుతం రాష్ట్రంలో 19170 వలంటీర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
కనుక వాటన్నింటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్దం అయ్యింది.ప్రజల వద్దకు పథకాలు అనే ఉద్దేశ్యంతో ఈ గ్రామ వలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు.
ఈ వలంటీర్లకు మంచి స్పందన వస్తోంది.