జమ్మూకశ్మీర్లో వరుస పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి.తాజాగా ఉదంపూర్ లోని మరో బస్సులో పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.అయితే, గడిచిన ఎనిమిది గంటల్లో జమ్ముకాశ్మీర్ లో ఇది రెండో పేలుడు.
దీంతో ఎక్కడ, ఎప్పుడు బ్లాస్టులు జరుగుతాయోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అయితే, ఈ పేలుళ్లలో ఉగ్రకోణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.