ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు…హడావిడి మామూలుగా లేదు.చాలా వరకు అధికార పార్టీ పంచాయతీ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు గెలుస్తుంది.
మరోపక్క మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఇలాంటి తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అయింది.
ఈ క్రమంలో రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది.
రిలీజ్ అయిన షెడ్యూల్ ప్రకారం… ఈ నెల 25 వ తారీకున నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
నామినేషన్ల దాఖలుకు మార్చి నాలుగో తారీఖు ఆఖరు తేదీ, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 8వ తేదీ వరకు అవకాశం ఉంటుంది అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.కాగా మార్చి 15వ తారీకు ఎలక్షన్ నిర్వహించనున్నట్టు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనున్నట్లు తెలిపింది.
ఇక అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని స్పష్టం చేసింది.