ప్రస్తుతం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల హడావిడి నడుస్తున్న విషయం తెలిసిందే.కావున ప్రస్తుతం రాజకీయాలన్నీ హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి.
అంతేకాక కావున ఎంత మేర ప్రజల ఆలోచనలను తమ వైపు తిప్పుకోవడానికి తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి రాజకీయ పార్టీలు.ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహ, ప్రతి వ్యూహాలను పన్నుతూ ఎట్టి పరిస్థితిలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచేలా ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఈ సందర్భంగా పార్టీలు పరిస్థితులకు తగ్గట్టు తమ ప్రచార వ్యూహాన్ని మార్చుకుంటాయి.ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున మంత్రులు ఎమ్మెల్సీలు ప్రచారం నిర్వహిస్తున్నా ట్రబుల్ షూటర్ హరీష్ రావుపైనే అందరూ నమ్మకంగా ఉన్నారు.
అయితే ఇప్పటి వరకు హరీష్ రావు ప్రచారం చేస్తూ వచ్చినా బాల్క సుమన్ ఎంట్రీతో ఒక్కసారిగా రకరకాల ప్రచారం మొదలైంది.
అయితే హరీష్ రావు అంతర్గతంగా ఈటెల రాజేందర్ కు మద్దతు తెలుపుతున్నాడని అందుకే కెటీఆర్ నమ్మకస్థుడు బాల్క సుమన్ అందుకే ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నాడని ఒక ప్రచారం మొదలైంది.
అయితే ఈ ప్రచారం ప్రతిపక్షాల నుండి మొదలైందని గడువు దగ్గర పడుతున్నదనే ఉద్దేశ్యంతో మాత్రమే బాల్క సుమన్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నాడని టీఆర్ఎస్ వర్గాలు తెలుపుతున్నాయి.
అయితే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ను ఎదుర్కోలేక రకరకాల కుయుక్తులు పన్నుతున్నారని టీఆర్ఎస్ ను ధైర్యంగా ఎదుర్కోలేక ఇటువంటి అసత్య ప్రచారాలకు దిగుతున్నారని తద్వారా బీజేపీ నేతలు హుజూరాబాద్ లో ఓటమిని పరోక్షంగా ఒప్పుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే అని, రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇటువంటి ప్రచారాలు జరుగుతుంటాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.
.