రన్ రాజా రన్ సినిమాతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్.మొదటి సినిమాతోనే సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ నిర్మాతలు రెండో సినిమాగా మిర్చీ తీసి సూపర్ హిట్ కొట్టారు.
తరువాత డార్లింగ్ ప్రభాస్ తోనే సాహూ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టకపోయిన నష్టాలు మాత్రం రాలేదని టాక్ ఉంది.
ప్రస్తుతం మరోసారి 200 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమాని యూవీ నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.
ఇదిలా ఉంటే ఇది ప్రభాస్ హోమ్ బ్యానర్ అని, దీనిలో డార్లింగ్ పెట్టుబడులు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే.ఇప్పుడు ఈ బ్యానర్ నిర్మాతలు మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు.
వీ సెల్యులాయిడ్స్ అనే పేరుతో కొత్త బ్యానర్ ఎనౌన్స్ చేశారు.ఈ బ్యానర్ ద్వారా తమ ఫ్యూచర్ ప్లాన్ గురించి కూడా నిర్మాతలు త్వరలో చెప్పడానికి రెడీ అవుతున్నట్లు బోగట్టా.
పెద్ద స్టార్స్ తో సినిమాలని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే తెరకెక్కిస్తారు.అయితే వి సెల్యులాయిడ్స్ బ్యానర్ పై చిన్న హీరోలు, మినిమమ్ బడ్జెట్ సినిమాలని, అలాగే ఓటీటీ కంటెంట్ అయిన వెబ్ మూవీస్, వెబ్ సిరీస్ లని నిర్మించబోతున్నట్లు సమాచారం.అలాగే రెగ్యులర్ కమర్షియల్ కంటెంట్ అని కాకుండా కొత్త టాలెంట్, డిఫరెంట్ కంటెంటలతో వచ్చే దర్శకులు, రచయితలకి వీ సెల్యులాయిడ్స్ ద్వారా అవకాశాలు కల్పించబోతున్నారని టాక్ నడుస్తుంది.త్వరలో దీనికి సంబంధించి ప్రత్యక్ష పనులు అన్ని మొదలవుతాయని, గ్రాండ్ గా ఈ బ్యానర్ ని లాంచ్ చేసే ప్రయత్నంలో నిర్మాతలైన వంశీ, ప్రమోద్, విక్రమ్ లు ఉన్నట్లు బోగట్టా.
.