సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో మహర్షి సినిమా ఒకటి.ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసాడు.
ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సందేశాత్మకంగా తెరకెక్కించడం వల్ల ఈ సినిమాను ప్రేక్షకులు సూపర్ హిట్ చేసారు.ఈ మధ్యనే ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా లభించింది.
ఇక తాజాగా ఈ సినిమాకు మరొక అవార్డు లభించింది.
ఈ సినిమా విడుదల అయ్యి రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.
ఈ సినిమాను వ్యవసాయ నేపథ్యంలో తెరకెక్కింది.స్నేహితుడి ఆశయాన్ని నెరవేర్చడం కోసం తన సుఖాలను వదిలిపెట్టి మరి వచ్చి స్నేహితుడి ఆశయాన్ని నెరవేర్చిన పాత్రలో మహేష్ కనిపించాడు.
యాక్షన్ ఎమోషన్స్ అన్ని కలిపి మంచి కమర్షియల్ సినిమాను ప్రేక్షకులకు వంశి పైడిపల్లి అందించాడు.
ఇక నిన్న హైదరాబాద్ లో సాక్షి 6th ఎక్స్ లెన్స్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది.ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు.ఈ వేడుకలో చాలా మంది తారలు తళుక్కున మెరిశారు.
ఈ వేడుకలో భాగంగా అవార్డ్స్ అందించారు.అందులో మహర్షి సినిమాకు కూడా మూడు క్యాటగిరీ లలో మూడు అవార్డులు దక్కాయి.
బెస్ట్ డైరెక్టర్ అవార్డును వంశీ పైడిపల్లి దక్కించుకున్నాడు.
ఇక బెస్ట్ యాక్టర్ అవార్డు మహేష్ బాబు కు రాగా బెస్ట్ ఫిలిం అవార్డును దిల్ రాజు అందుకున్నారు.ఈ వేడుకలో మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు.ఇక మహేష్ ప్రెసెంట్ సినిమాల విషయానికి వస్తే ఆయన పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.ఇందులో కీర్తి సురేష్ మహేష్ కు జంటగా నటిస్తుంది.ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చెయ్యబోతున్నారు.