పుల్వామా లో మరోసారి కాల్పుల మోత... నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి కాల్పుల మోత మోగింది.అక్కడి పుల్వామా జిల్లా లో భద్రతాదళాలు కూబింగ్ నిర్వహించారు.

 Another Attack On Pulwama-TeluguStop.com

పుల్వామా నగర సమీపంలోని లస్సీ పోరా వద్ద ఉగ్రవాదులు ఉన్నారని పక్కా సమాచారం అందడం తో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించారు.ఈ క్రమంలో ఉగ్రవాదులు తొలుత కాల్పులకు దిగారు.

దీనితో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడం తో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తుంది.పుల్వామా జిల్లా లో ఉగ్రవాదులు చొరబడ్డారు అని భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందడం తో కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పుల్వామా లో మరోసారి కాల్పుల మ�

అయితే ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా సంఘటనా స్థలంలో మూడు ఏకే రైఫిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ క్రమంలో మరి కొందరు ఉగ్రవాదులు పారిపోయడం తో భద్రతా బలగాలు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.గత కొంత కాలంగా జమ్మూ కాశ్మీర్ లో తరచూ ఉగ్రవాదుల చొరబాటు చర్యలకు పాల్పడుతున్నారు.ఈ క్రమంలో అక్కడ పలు మార్లు ఎదురు కాల్పులు ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube