లెక్కకు మించి వాట్సాప్ గ్రూపుల్లో మీ ప్రమేయం లేకుండానే చేరిపోయి ఉంటారు.ఆయా గ్రూపులు మీకు అవసరం లేకపోయినా మీ ఫోన్లలో కనిపిస్తుంటాయి.
అవసరం లేని మెసేజులు వేళ కాని వేళలో వస్తూ చికాకు కలిగిస్తుంటాయి.ఒక వేళ ఆ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయితే, మీరు ఎగ్జిట్ అయినట్లు ఆ గ్రూపులో కనిపిస్తుంటుంది.
ఎవరైనా దానిపై క్లిక్ చేస్తే మీ పేరుతో సహా కొన్ని వివరాలు కనిపిస్తాయి.తెలియని వారితో కొంచెం ఇబ్బంది ఉంటుంది.
అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేలా కొత్త ఫీచర్ వచ్చింది.దీని ద్వారా మీరు సైలెంట్గా వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ కావొచ్చు.
చికాకు కలిగించే వాట్సాప్ గ్రూపుల నుంచి బయటపడొచ్చు.
వాట్సాప్లో బాధాకరమైన ఫీచర్లలో గ్రూపుల నుంచి ఎగ్జిట్ కావడం ఒకటి.
యూజర్లు అవసరం లేని వాట్సాప్ గ్రూపుల నుంచి నిష్క్రమించడానికి వీలు కల్పించే కొత్త ఫీచర్పై వాట్సాప్ పని చేస్తోందని తెలుస్తోంది.ఆ కొత్త ఫీచర్తో వాట్సాప్ గ్రూపుల సభ్యులకు ఎటువంటి పాప్ అప్ నోటిఫికేషన్ కనిపించదు.
దీంతో చాలా మందికి ఇది ఉపశమనం కలిగించినట్లు అనిపిస్తోంది.సభ్యుని నిష్క్రమణ గురించి గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే తెలుస్తుంది.
ఇతర సభ్యులకు ఏ మాత్రం ఈ విషయం తెలియదు.కంపెనీ ఈ ఫీచర్ను అభివృద్ధి చేయడంలో పని చేస్తోందని, రాబోయే రోజుల్లో ఎప్పుడైనా దీన్ని విడుదల చేస్తుందని ప్రకటన వచ్చింది.
ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ డెస్క్టాప్ బీటాలో గుర్తించబడింది.తర్వాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ కోసం వాట్సాప్ బీటాకు కూడా వచ్చే అవకాశం ఉంది.
టెస్టింగ్లోని చాలా ఫీచర్ల మాదిరిగానే, ఇది స్థిరమైన అప్డేట్ కానుంది.కొన్ని నెలల్లో వాట్సాప్ వినియోగించే అన్ని పరికరాలకు ఇది వర్తించనుంది.