ఎండిపోతున్న డొక్కకు తెలుసు ఆకలి విలువ.పరిస్థితుల వేడికి పేగులన్ని మాడిపోతుంటే వచ్చే అరుపును అడుగు ఆకలి విలువ.
వేదన చితుకుల పొయ్యి చిటపటలాడుతుంటే దాని ఎదురుగా కూర్చున్న యాచకులను అడుగు ఆకలి విలువ.అందుకే కావచ్చూ దేవుడు ఆకలికి కులం, మతం పెట్టలేదు.
పేద ధనిక అనే వ్యత్యాసం చూపలేదు.ఎవరు నేర్పకుండా నేర్చుకునే భాష అమ్మా అయితే.
ఎవరు చెప్పకుండానే కలిగేది ఆకలి.అందుకే ఆకలి తీర్చేవాడు దేవుడితో సమానం.
ఇక నేడు సమాజంలో ఎవరి ఆకలో నేను ఎందుకు తీర్చాలి అని అనుకునే వారున్నారు.ఎదుటి వారి ఆకలి నా ఆకలి కాదా అని భావించి అన్నదానం చేసే వారు ఉన్నారు.
ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు.
ఇకపోతే మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి తెలంగాణ బేకరీ ఆధ్వర్యంలో యాచకులకు ప్రతి గురువారం రోజున అన్నదానం చేస్తున్నాడు ఇస్మాయిల్ అనే వ్యక్తి.మానవ సేవే మాధవ సేవ అనే సత్యాన్ని ఎరిగిన ఇస్మాయిల్ యాచకులకు అన్నం పెట్టడం లో ఉన్న ఆనందం ఎందులోనూ లేదు అని, అందరం బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి అని భావించడం అతని మంచితనానికి నిదర్శనం.