మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉన్న చిరంజీవి అమ్మ అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు.
అమ్మా జన్మదిన శుభాకాంక్షలు.క్వారెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేకపో ఇలా తెలుపుతున్నా.
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ అభినందనలతో శంకర బాబు అంటూ పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.
మెగా ఫ్యామిలీలో ఎవరి బర్త్ డే అయినా సరే ఫ్యామిలీ అంతా కలిసి చాలా సరదాగా చేసుకుంటారు.
అసలైతే అమ్మ పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతారు.కానీ చిరంజీవి క్వారెంటైన్ లో ఉండటం వల్ల ఇప్పుడు అలాంటి వేడుకలు నిర్వహించడం లేదు.
ఇటీవలే కరోనా పాజిటివ్ వచ్చినట్టు ప్రకటించిన చిరంజీవి సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు.వైద్యుల పర్యవేక్షణలో చిరంజీవి ట్రీట్మెంట్ జరుగుతుందని తెలుస్తుంది.
చిరు ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తుంది. ఈమధ్య బయట ఈవెంట్లకు ఎక్కువగా పాల్గొన్న చిరంజీవి ఎంత వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకున్నా కరోనా పాజిటివ్ వచ్చింది.
అందుకే అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.