తెలుగమ్మాయి అయినా కూడా కోలీవుడ్లో ఈ అమ్మడికి ఎక్కువగా అవకాశాలు దక్కాయి.తెలుగులో ఈ అమ్మడు ఒకటి రెండు సినిమాలు చేసినా కూడా పెద్దగా అవి ఆడలేదు.
దాంతో కోలీవుడ్కే పరిమితం అయ్యింది.అయితే తెలుగులో ఈ అమ్మడు రాణించాలనే పట్టుదలతో ఉంది.
ప్రస్తుతం ఈ అమ్మడు నిశబ్దం చిత్రం కోసం వెయిట్ చేస్తోంది.అనుష్క హీరోయిన్గా నటించిన ఆ సినిమాలో అంజలి కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.
అంజలి హీరోయిన్గా ఈమద్య కాలంలో కోలీవుడ్లో కూడా పెద్దగా రాణించడం లేదు.దాంతో ఈమెకు టాలీవుడ్లో బిజీ అవ్వాలనే కోరిక కలిగింది.అక్కడ స్టార్ హీరోలతో ఛాన్స్లు రాకపోవడంతో టాలీవుడ్లో కనీసం లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో అయినా బిజీ అవ్వాలని ఈ అమ్మడు ఆశపడుతోంది.అందుకే నిశబ్దం చిత్రంతో మళ్లీ పుంజుకుని తెలుగులో బిజీ అవ్వాలనేది ఈ అమ్మడి ఆశగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
అంజలి తెలుగులో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది.దాంతో ఆమెను కమర్షియల్ హీరోయిన్గా చూసేందుకు ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు.ఆ కారణంగానే ఆమెను వరుసగా లేడీ ఓరియంటెడ్ చిత్రాల కోసమే సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఆమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా చేసేందుకు ఒప్పుకుంటున్నా ఈమద్య అవి కూడా రావడం లేదట.
అందుకే ఇప్పుడు నిశబ్దం చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుని ఈమె ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.