తెలుగు, తమిళ్ బాషలలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్ నటి అంజలి.తెలుగమ్మాయి అయిన అంజలి ఫోటో సినిమాతో 15 ఏళ్ల క్రితం టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.తరువాత ప్రేమలేఖ రాసా అనే సినిమాలో నటించింది.అయితే ఈ సినిమాలు పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో ఈ భామ కోలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ తన అదృష్టం పరీక్షించుకుంది.
షాపింగ్ మాల్ సినిమా తో ఒక్కసారిగా కోలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది.తరువాత జర్నీ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.అప్పటి నుంచి కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ మంచి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.తెలుగులో మొదటి సినిమా నటించిన ఆరేళ్ళ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ కి జోడీగా ఈ భామ టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చింది.
అప్పటి నుంచి తెలుగులో కూడా మంచి అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.
రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్ కి జోడీగా అవకాశాలు అందుకోవడంతో పాటు హిట్స్ కూడా కొట్టింది.
అయితే తమిళలో ఎక్కువ అవకాశాలు వస్తూ ఉండటం అక్కడే సినిమాలు చేస్తూ అడపాదడపా తెలుగులో సినిమాలు చేస్తుంది.ప్రస్తుతం ఈ భామ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తుంది.
ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా అంజలి తెలుగు సినిమా అవకాశాలపై ఆసక్తికరంగా స్పందించింది.తెలుగులో తనకు భాగానే అవకాశాలు వస్తున్నాయని, చాలా మంది కథలు చెప్పడానికి వస్తున్నారని చెప్పింది.
అయితే తానే సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా అని క్లారిటీ ఇచ్చింది.టాలీవుడ్ తనని ఎప్పుడూ దూరం పెట్టలేదని, ఇక్కడ నా సినిమాలు నాకు ఎప్పుడూ ఉంటాయని చెప్పింది.
వకీల్ సాబ్ తర్వాత మరో రెండు సినిమాలు తెలుగులో చేయబోతున్నట్లు కూడా అంజలి చెప్పడం విశేషం.