నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ మొదలు కాగానే కరోనా ప్రభావం నెలకొనడంతో ఈ సినిమా షూటింగ్ను వాయిదా వేశారు.
కాగా ఇటీవల ఈ సినిమా షూటింగ్ను ఎట్టకేలకు తిరిగి ప్రారంభించారు.దీంతో ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ వద్ద తన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ క్రమంలో బాలయ్యకు గతంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను అందించిన బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇందులో ఒకటి పవర్ఫుల్ రైతు పాత్ర కాగా, మరొకటి అఘోరా పాత్ర అని చిత్ర వర్గాల్లో కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది.ఈ మేరకు రైతు పాత్రకు సంబంధించిన టీజర్ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారా అనే అంశం ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇప్పటికే పలువురు భామల పేర్లు ఈ సినిమా కోసం వినిపించగా, తాజాగా ఈ సినిమాలో నటి అంజలిని ఓకే చేసినట్లు చిత్రపురిలో టాక్ వినిపిస్తోంది.
గతంలో బాలయ్య నటించిన డిక్టేటర్ చిత్రంలో అంజలి హీరోయిన్గా నటించి మెప్పించింది.ఆ సినిమాలో బాలయ్య-అంజలి కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబోను సెట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ క్రమంలోనే అంజలిని ఈ సినిమాలో తీసుకున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఇక ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు.
బోయపాటి ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలని చూస్తున్నాడు.