ఒకప్పటి తెలుగు సినీ నటి అనిత హసానందాని పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తెలిసిన నటి.నువ్వు నేను సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనిత తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది.ఇక తను 2013లో ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకొని తెలుగు సినిమాలకు దూరమయ్యింది.
తన పెళ్లి తర్వాత మొత్తానికి బాలీవుడ్ వైపు అడుగులు పెట్టేసిన అనిత అక్కడే సెటిల్ అయింది.బాలీవుడ్ బుల్లితెరలో కూడా పలు సీరియల్ లో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే కొన్ని రోజుల కిందట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తన బిడ్డ కోసం ఇటీవలే ఇండస్ట్రీకి గుడ్ బై కూడా చెప్పింది.
ప్రస్తుతం కోవిడ్ ప్రభావం ఉన్నా లేకున్నా తన బిడ్డ పై పూర్తి దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుందట అనిత.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.
అంతేకాకుండా తన భర్తతో ఫన్నీ వీడియోలు చేస్తూ తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంటుంది.తన ముద్దుల కొడుకు ఫోటోలను కుడా అభిమానులతో పంచుకుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా మరో ఫోటో షేర్ చేసింది.
అందులో తన భర్తతో క్లోజ్ గా ఉంటూ కనిపించగా.అందులో కొన్ని విషయాలు పంచుకుంది అనిత.
ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా తనను ఏడిపించేది తన భర్త అంటూ.అందుకే తనకు చిరాకు తెప్పించే ప్రతి మూమెంట్ లో తను తనతో ఉండాలి అనుకుంటుందని తెలిపింది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక అనిత మళ్లీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి.