ప్రస్తుతం మార్కెట్ లో వ్యభిచారం నేరం అయిన కూడా గుట్టుగా జరుగుతూనే ఉంది.అదే సమయంలో కొంత మంది కుర్రాళ్ళు కాల్ బాయ్స్ గా మారి ఉన్నత కుటుంబాలకి చెందిన ఆడవాళ్ళని ట్రాప్ చేయడం, వారి శారీరక వంచలు తీర్చడం చేస్తూ ఉంటారు.
అయితే కొంత మంది ఇలాంటి పని చేస్తూ మరింత శృతి మించి మహిళలు తమతో గడిపిన ఏకాంత వీడియోలు సీక్రెట్ గా షూట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు.అలాగే కోల్ కతాకి చెందిన ఇద్దరు కిలాడీలు అలాంటి శృంగార వీడియోలు ఏకంగా 182 మహిళలవి షూట్ చేసినట్లు సంచలన విషయాలు బయటపడ్డాయి.
కోల్ కతాకు చెందిన అనీష్, ఆదిత్య స్నేహితులు.ఇద్దరు కూడా మంచి వ్యాపారాలు చేస్తూ భాగా సంపాదించారు.అయితే వీరి హై ప్రొఫైల్ లైఫ్ వీరికి మంచి అవకాశం ఇచ్చింది పెద్ద పెద్ద పార్టీలకి వెళ్తూ ఉన్నత కుటుంబాల్లోని మహిళలను ట్రాప్ చేసేవారు.తమ దగ్గర ఉన్న డబ్బుని ఉపయోగించుకొని వారికి తరుచుగా ఫోన్ చేస్తూ వారిని లైంగికంగా వాడుకునే వారు.
తరువాత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బుని గుంజేవారు.అయితే వీరు తీసిన వీడియోలు వారి వద్ద వంటవాడిగా కైలాష్ యాదవ్ కి దొరికాయి.
వాటితో అతను కూడా మహిళలల్ని బెదిరించి డబ్బులు గుంజుకోవడం మొదలెట్టాడు.ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కైలాష్ ని అరెస్ట్ చేసి విచారించగా ఇద్దరు మిత్రుల కథ మొత్తం బయట పడింది.
వారి షూట్ చేసిన అశ్లీల వీడియోలను పోలీసులు స్వాదీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు.