ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గా మారిన వ్యక్తి ఎవరు అంటే.అందరూ సమాధానం ఇచ్చేది అనిల్ రావిపూడి అని.
చిన్న చిన్న సినిమాలతో తన కెరీర్ ని మొదలు పెట్టి ఏకంగా సూపర్ స్టార్ లను కూడా తెరకెక్కించే పనిలో బిజీ బిజీ అయిపోయాడు ఈ దర్శకుడు.పెద్ద పెద్ద హీరోలు కూడా తన కోసం కథ రెడీ చేయాలంటూ అడిగే స్థాయికి చేరుకున్నాడు అనిల్ రావిపూడి.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా ఈయన కొనసాగుతున్నాడు.మొదటి సినిమా నుంచి పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ లను రూపొందిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.
ఇకపోతే నేడు తన 39వ పుట్టినరోజుని జరుపుకోబోతున్నాడు.
అనిల్ రావిపూడి త్వరలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఈ సంవత్సరం మొదట్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఆయన ఎఫ్3 ప్రాజెక్ట్ చేయాలని భావించిన.కాకపోతే కొన్ని అవాంతరాలు తోడవడంతో ఎఫ్ 3 షూటింగ్ ఇప్పట్లో మొదలు కాదని అర్థం అవుతోంది.
వెంకటేష్, వరుణ్ తేజ్ లతో గత సంవత్సరం ఎఫ్ 2 సినిమాను తెరకెక్కించి విజయం సాధించాడు.అయితే ఇంతలో అనిల్ రావిపూడి నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం ఓ కథను రాసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ విషయం అలా ఉండే మరోవైపు హీరో రామ్ కోసం ఓ స్టోరీని కూడా రెడీ చేసినట్లు కొన్ని రోజులు ప్రచారం జరిగింది.మరోవైపు సాయి పల్లవి ని హీరోయిన్ గా పెట్టి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను కూడా రెడీ చేయబోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి.చూడాలి మరి ఎఫ్3 సినిమా లేటు కావడంతో అనిల్ రావిపూడి ఎటువైపు మొగ్గు చూపుతాడో.నేడు ఆయన 39 పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి మరపురాని పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన మరిన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకుల కోసం తీయాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.