సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో వస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను దక్కించుకుంటున్నాయి.మంచి కథలను ఎంపిక చేసుకుని సమర్పిస్తున్న దర్శకుడు సుకుమార్ పేరుతో పాటు డబ్బును సంపాదిస్తున్నాడు.
ఉప్పెన సినిమా కు గాను సుకుమార్ పెట్టుబడి పెట్టకుండా కేవలం తన శిష్యుడితో సినిమా ను చేయించి ఆ సినిమా కు కథ మరియు స్క్రీన్ ప్లే అందించడం తో పాటు కాస్త సినిమా విషయమై దృష్టి పెట్టడం ద్వారా 20 కోట్ల వరకు సుకుమార్ ఖాతాలో పడ్డట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.పెద్ద ఎత్తున వస్తున్న ఈ లాభాలను చూసి మరి కొందరు దర్శకులు కూడా తమ బ్రాండ్ ఇమేజ్ ను చిన్న చిత్రాలకు ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారు.
ఇటీవల ఇద్దరు దర్శకులు చిన్న చిత్రాలను పైకి లేపేందుకు ముందుకు వచ్చారు.అందులో మొదటి దర్శకుడు అనీల్ రావిపూడి కాగా రెండవ దర్శకుడు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్.
వీరిద్దరు కూడా ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపొందిన జాతి రత్నాలు సినిమాకు తన పేరును వేయించుకోవడంతో ఆ సినిమా కు హైప్ ఇచ్చాడు.
ఇచ్చినట్లుగా నే ఆ సినిమా కు మంచి మార్పులు చేర్పులు చెప్పి సినిమా సక్సెస్ అయ్యేలా చేశాడు.ఇక అనీల్ రావిపూడి విషయానికి వస్తే గాలి సంపత్ నిర్మాత తనకు సన్నిహితుడు అవ్వడం వల్ల సినిమా ను ప్రమోట్ చేసేందుకు గాను ప్రజెంటర్ పేరును వేసేందుకు ఒప్పుకున్నాడు.
అలాగే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నాడు.కథ మరియు స్క్రీన్ ప్లే తనదే అంటూ చెప్పుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ కూడా టైటిల్ కార్డు వేయించుకున్నాడు.
వరుసగా ఇప్పటి వరకు విజయాలే తప్ప పరాజయాలు తెలియని దర్శకుడు అనీల్ రావిపూడి నిర్మాతగా ఈ సినిమా తో నిరాశ పడ్డట్లు అయ్యింది.అందుకే ఈ సినిమా ను ఆయన కమిట్ అయ్యి తప్పు చేశాడు అనేది కొందరి వాదన.
గాలి సంపత్ ను సమర్పించి అనీల్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటీ.?
.