మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ఇటీవల షూటింగ్ పనులు ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని రమేష్ వర్మ అనే డైరెక్టర్తో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.‘ఖిలాడి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను కూడా రవితేజ తాజాగా ప్రారంభించాడు. ఇక ఇదిలా ఉండగా తనకు ‘రాజా ది గ్రేట్’ వంటి బ్లాక్బస్టర్ విజయాన్ని అందించిన దర్శకుడు అనిల్ రావిపూడితో మరో సినిమా చేసేందుకు రవితేజ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.రాజా ది గ్రేట్ చిత్రానికి సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్2 చిత్రానికి సీక్వెల్గా ఎఫ్3 చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.కానీ ఎఫ్2 హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్లు తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ గ్యాప్లో మరో సినిమా చేసేందుకు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే రవితేజను కలిసి ఓ స్టోరీలైన్ వినిపించాడని, అది ఖచ్చితంగా రాజా ది గ్రేట్ సీక్వెల్ అని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.గుడ్డివాడి పాత్రలో రవితేజ చేసిన రచ్చ ఎలా ఉంటుందో మనం రాజా ది గ్రేట్ చిత్రంలో చూశాం.
ఇప్పుడు దాన్ని మించిన రచ్చ చేసేందుకు ఈ సీక్వెల్ను ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి.మరి ఎఫ్2 సీక్వెల్ను కాదని రాజా ది గ్రేట్ సీక్వెల్ను ఆయన తెరకెక్కిస్తాడా లేదా అనేది తెలియాలంటే ఆయన క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే.