అనిల్ రావిపూడి రోజురోజుకూ టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరు సంపాదిస్తున్నాడు.వరస పెట్టి హిట్స్ కొడుతూ వెనుతిరిగి చూసుకోవడం లేదు.
అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన ‘సరిలేరు నీకెవ్వరూ‘ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.మహేష్ కెరీర్ లో కూడా బిగ్ సక్సెస్ గా ఈ సినిమా నిలిచింది.
దీంతో ఈయనకు వరస ఆఫర్స్ వస్తున్నాయి.
ఎప్పుడు ఏదొక రూమర్స్ వస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు కూడా మరొక క్రేజీ రూమర్ వినిపిస్తుంది.అనిల్ రావిపూడి శర్వానంద్ తో కూడా ఒక చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే అనిల్ శర్వాకు కథ కూడా వినిపించాడని టాక్ వినిపిస్తుంది.మరి నిజంగానే ఈ కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందా అనేది తెలియాలంటే మరి కొద్దీ రోజులు వేచి ఉండాల్సిందే.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం శర్వానంద్ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘మహాసముద్రం‘ సినిమాలో నటిస్తున్నాడు.
అతిధి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.ఇందులో హీరో సిద్దార్ధ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
అటు అనిల్ కూడా F3 సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.ఇది F2 సినిమాకు సీక్వెల్ గా వస్తుంది.ఈ సినిమాపై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత అనిల్ బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు.
మరి చూడాలి అనిల్ శర్వా కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో లేదో.