వరుస కమర్షియల్ సక్సెస్ లతో స్టార్ దర్శకుడుగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి.సరిలేరు నీకెవ్వరూ సినిమాతో వరుసగా ఐదో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఆరో సినిమా కోసం దిల్ రాజుతో జత కట్టాడు.
చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెంత్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకి అనిల్ రావిపూడి తీసుకొచ్చిన ఎఫ్2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థియేటర్ లో ప్రేక్షకులకి వినోదాన్ని అందించడంతో పాటు ఏకంగా వంద కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకొని దిల్ రాజుకి భారీగా డబ్బులు తెచ్చిపెట్టింది.
ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి ఈ సినిమా సీక్వెల్ గా ఎఫ్౩ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.మొదటి సినిమాకి కొనసాగింపుగానే ఎఫ్౩ కథని అనిల్ రావిపూడి సిద్ధం చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.
ఇదిలా ఉంటె ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు మరో హీరో కూడా నటిస్తున్నాడని టాక్ వినిపించింది.
మూడో హీరోగా, రవితేజ, సాయి ధరమ్ తేజ్ పేర్లు వినిపించాయి.మూడో హీరో ఎవరనే విషయాన్ని బయటపెట్టకుండా అనిల్ సీక్రెట్ మెయింటేన్ చేస్తున్నాడని చర్చ జరిగింది.అయితే దీనిపై దర్శకుడు అనిల్ రావిపూడి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.ఎఫ్3 సినిమాలో మూడో హీరోకి అవకాశమే లేదని, ఆ చర్చ కూడా ఎప్పుడూ రాలేదని, కథలో కూడా అలాంటి అవసరం రాలేదని తేల్చి చెప్పేశాడు.మొదటి సినిమాకి కొనసాగింపుగానే ఈ సినిమా ఉండబోతుందని, ఈ సారి మరింత ఫన్ మాత్రం ఉంటుందని తెలిపాడు.వెంకటేష్, వరుణ్ తేజ్ లు మాత్రమే ఇందులో కూడా హీరోలుగా చేస్తున్నారని స్పష్టం చేసేశాడు.