టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న అనీల్ రావిపుడి పటాస్ నుండి రీసెంట్ గా రిలీజైన ఎఫ్3 వరకు తన సక్సెస్ మేనియా కొనసాగిస్తున్నారు.ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వరుస హిట్లు కొడుతున్న అనీల్ రావిపుడి తన డ్రీం ప్రాజెక్ట్ ల గురించి చెప్పుకొచ్చారు.
జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి సోషియో ఫాంటసీ సినిమాలు చేయాలని ఉందని ఆయన అన్నారు.అంతేకాదు మాయాబజార్ లాంటి సినిమా ఫుల్ ఎమోషన్స్ తో చేయాలని ఉందని అన్నారు.
ఇక ఇదే కాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నాలుగు స్థంభాలుగా చెప్పుకునే చిరు, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జునలతో సినిమా చేయాలని అన్నారు.
ఆల్రెడీ వెంకటేష్ తో ఎఫ్2, ఎఫ్ 3 రెండు సినిమాలు చేశానని.
త్వరలో బాలకృష్ణతో సినిమా చేస్తున్నాని.ఇక చిరంజీవి, నాగార్జునలతో సినిమా చేయడమే తన డ్రీం అని అన్నారు.
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత ఫ్లాప్ లేని డైరక్టర్ లిస్ట్ లో తను కూడా కొనసాగుతున్నాడు అనీల్ రావిపుడి.ఎఫ్ 3 సక్సెస్ తో మరింత జోష్ లో ఉన్న అనీల్ రావిపుడి బాలయ్యతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.
వరుస హిట్లు కొడుతున్నాడు కాబట్టి అనీల్ రావిపుడితో చిరంజీవి, నాగ్ సినిమా చేయడం పక్కా అని చెప్పొచ్చు.