దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తెరకెక్కించి అదిరిపోయే హిట్ను అందుకున్నాడు.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.
గతంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్లతో కలిసి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్2ని తెరకెక్కింంచి ఎలాంటి హిట్ అందుకున్నాడో అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించేందుకు అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడు.
గతంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలిపిన అనిల్ రావిపూడి, ఈ సినిమా స్క్రిప్టును రెడీ చేస్తున్నట్లు తెలిపాడు.కాగా ప్రస్తుతం లాక్డౌన్ నెలకొన్న కారణంగా ఈ సినిమా పనులను పూర్తి కూడా చేశాడట.
కానీ ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ కారణంగా ఈ సినిమా స్క్రిప్టును హీరోలకు వినిపించడం కుదరలేదని ఆయన అంటున్నాడు.ఒక్కసారి ఈ లాక్డౌన్ ఎత్తివేయగానే వెంటనే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్లకు వినిపించేందుకు రెడీ అవుతున్నాడు అనిల్.
ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.
గతంలో వచ్చిన ఎఫ్2 సినిమా సక్సెస్ను మరోసారి ఎఫ్3తో రిపీట్ చేయాలని చూస్తున్నాడు ఈ డైరెక్టర్.
మరి ఈసారి ఎలాంటి కామెడీతో అనిల్ రావిపూడి మనముందుకు వస్తాడో అని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.లాక్డౌన్ వీలైనంత త్వరగా ముగిస్తే బాగుంటుందని, సినిమా రంగానికి చెందిన అన్ని పనులు కూడా తొందరగా మొదలయితే బాగుంటుందని అనిల్ రావిపూడి కోరుతున్నాడు.